న్యూఢిల్లీ, ఆగస్టు 16: రానున్న పండుగ సీజన్ సందర్భంగా నెలకొనే డిమాండ్తో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులు, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) రంగాల్లో 50,000 తాత్కాలిక ఉద్యోగాలు లభిస్తాయని స్టాఫింగ్ కంపెనీ టీమ్లీజ్ సర్వీసెస్ వెల్లడించింది. బీఎఫ్ఎస్ఐలో ఇప్పటికే క్రెడిట్కార్డ్ అమ్మకాలు, పర్సనల్ ఫైనాన్స్, రిటైల్ ఇన్సూరెన్స్ జోరందుకున్నాయని, 2023 ద్వితీయార్థంలో ఇది మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నట్టు టీమ్లీజ్ విడుదల చేసిన రిపోర్ట్లో పేర్కొంది. ఫైనాన్షియల్ సాధనాలకు నెలకొంటున్న డిమాండ్ కారణంగా బీఎఫ్ఎస్ఐ సంస్థలు వాటి సిబ్బంది సంఖ్యను పెంచుకుంటాయన్నది. వచ్చే 5-6 నెలలూ జాబ్ మార్కెట్ బాగుంటుందని, గత నెలరోజులుగా టెంపరరీ స్టాఫర్స్ కోసం 25,000 జాబ్ ఓపెనింగ్స్ వచ్చాయని, ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ సంఖ్య 50,000కు మించుతుందని టీమ్లీజ్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణెందు ఛటర్జీ తెలిపారు. గతంలో బీఎఫ్ఎస్ఐ రంగాల్లో తాత్కాలిక ఉద్యోగాలు మెట్రోపాలిటిన్ నగరాలకే పరిమితమయ్యేదని, ఇప్పుడు ఈ-కామర్స్, రిటైల్ లెండింగ్, ఇన్సూరెన్స్ సర్వీసులకు ఇతర నగరాలు, పట్టణాల్లో పెరుగుతున్నదని వివరించారు.