హైదరాబాద్, జూలై 24: హైదరాబాద్లో ఇంటీరియర్ రంగంలో వస్తున్న పెనుమార్పులకు తగ్గట్టుగా హైదరాబాద్లో సరికొత్త సెంటర్ను ప్రారంభించింది ప్రోలెన్స్. 11,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ను టీ-హబ్ సీఈవో శ్రీనివాస రావు ప్రారంభించరు. ఈ సందర్భంగా కంపెనీ కో-ఫౌండర్, సీఈవో రామ హరినాథ్ మాట్లాడుతూ.. హైదరాబాద్లో ఇంటీరియర్ డిజైన్లకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఈ సెంటర్ను ప్రారంభించినట్లు, ముఖ్యంగా కో-వర్కింగ్ స్పేస్లో వీటికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు.
ఈ డిజైన్ సెంటర్ను ఏర్పాటు చేయడానికి రెండు కోట్ల వరకు పెట్టుబడి పెట్టినట్లు చెప్పారు. వచ్చే ఏడాది చివరిలోగా దేశవ్యాప్తంగా 20 సెంటర్లను ప్రారంభించనున్నట్లు, వీటిలో మరో రెండు హైదరాబాద్లోనే ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రస్తుతం 20 ఇంటీరియర్ డైజనర్లతో ఒప్పందం కుదుర్చుకొని వారీ ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు, భవిష్యత్తులో ఈ సంఖ్యను 100కి పెంచుకోనున్నట్లు ప్రకటించారు.