భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు
ముంబై, జనవరి 6: స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్పడింది. నూతన సంవత్సరంలో ఇప్పటి వరకు భారీగా పుంజుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీగా నష్టపోయాయి. వడ్డీరేట్లను పెంచనున్నట్లు ఫెడరల్ రిజర్వు ఇచ్చిన సంకేతాలతో అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుదుపునకు లోనయ్యాయి. ఫలితంగా ప్రారంభం నుంచే నష్టాల్లో పయనించిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 621 పాయింట్ల(1.03 శాతం) నష్టంతో మళ్లీ 60 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. చివరకు 59,601.84 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 179.35 పాయింట్లు తగ్గి 17,745.90 వద్ద ముగిసింది.