న్యూఢిల్లీ, జూన్ 3: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రైవేటీకరించేందుకు రెండు బ్యాంకు లు, ఒక సాధారణ బీమా కంపెనీ పేర్లను డిజిన్వెస్ట్మెంట్ కార్యదర్శుల గ్రూప్నకు నీతి ఆయోగ్ సమర్పించింది. ఆ పేర్లను క్యాబినెట్ కార్యదర్శి నేతృత్వంలోని కార్యదర్శుల గ్రూప్ ఖరారుచేసిన తర్వాత అనుమతి కోసం ప్రత్యామ్నాయ యంత్రాంగం ముందుకు ప్రతిపాదన వెళుతుంది. అటుతర్వాత ప్రధానమంత్రి నేతృత్వంలో కేంద్ర క్యాబినెట్ తుది ఆమోదముద్ర వేయాల్సివుంటుంది. 2021-22 బడ్జెట్లో ప్రతిపాదించిన మేరకు పేర్లను ఎంపికచేసే బాధ్యతను నీతి ఆయోగ్కు ప్రభుత్వం అప్పగించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు బ్యాంకులు, ఒక బీమా కంపెనీతో సహా కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా రూ.1.75 లక్షల కోట్లు సమీకరించాలని బడ్జెట్లో నిర్దేశించుకున్నది కేంద్ర ప్రభుత్వం. ప్రైవేటీకరించబోయే బ్యాంకు ఉద్యోగుల జీతాలు, పెన్షన్లతోపాటు ఇతర ప్రయోజనాల్ని పరిరక్షిస్తామని ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు.