హైదరాబాద్, ఏప్రిల్ 27: ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ల సంస్థ చేతక్..హైదరాబాద్ మరో అవుట్లెట్ను ప్రారంభించింది. కాచిగూడ వద్ద సిద్ది వినాయక ఆటోమొబైల్స్ ఏర్పాటు చేసిన ఈ అవుట్లెట్ను రాజధాని కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ వేమి రెడ్డి నర్సింహ రెడ్డి గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా సిద్ధి వినాయక ఆటోమొబైల్స్ చైర్మన్ బాబుల్ రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రంలో ఈవీ వాహన విక్రయాలు టాప్గేర్లో దూసుకుపోతున్నాయని, గతేడాది హైదరాబాద్లో ప్రారంభించిన తొలి అవుట్లెట్లో 2,500 యూనిట్ల వాహనాలను విక్రయించినట్టు చెప్పారు. మరో అవుట్లెట్ను త్వరలో ప్రారంభించబోతున్నట్టు తెలిపారు.