న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: వచ్చే ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ రూపకల్పన కోసం ముందస్తు సమావేశాల్ని అక్టోబర్ 10 నుంచి ప్రారంభించనున్నట్టు బుధవారం కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది.
2023-24 సంవత్సరానికి సవరించిన అంచనాల్ని, 2024-25 ఏడాదికి బడ్జెట్ అంచనాల్ని రూపొందించడానికి ఆర్థిక కార్యదర్శి నేతృత్వంలో వివిధ మంత్రిత్వ శాఖలతో సమావేశాలు జరపనున్నట్టు ఆర్థిక శాఖకు చెందిన బడ్జెట్ డివిజన్ ఒక నోటీసును సర్క్యులేట్ చేసింది.