న్యూఢిల్లీ : పోర్షే భారత్ మార్కెట్లో కయెన్ ప్లాటినం ఎడిషన్ను లాంఛ్ చేసింది. పేరుకు తగ్గట్టే ప్లాటినం ఎడిషన్కు ఎస్యూవీ ఎక్ట్సీరియర్, ఇంటీరియర్స్లో ప్లాటినం ఫినిషింగ్ ఇచ్చారు. ప్లాటినం ఎడిషన్తో కొన్ని అదనపు ఎక్విప్మెంట్నూ జోడించారు. కయెన్ నాలుగు వేరియంట్స్లో అందుబాటులో ఉంటుంది.
స్పోర్ట్స్ ఎగ్జాస్ట్స్, సైడ్ విండో ట్రిమ్స్, టెయిల్గేట్పై మోడల్ డిజిగ్నేషన్ వంటి ఫీచర్లతో ఈ ఎస్యూవీ కస్టమర్ల ముందుకొచ్చింది. ప్లాటినం ఎడిషన్ కయెన్ జెట్ బ్లాక్, వైట్, మూన్లైట్ బ్లూ, స్పెషల్ క్రెయన్ కలర్స్లో లభిస్తుంది. పోర్షే డైనమిక్ లైట్ సిస్టంతో ఎల్ఈడీ హెడ్లైట్స్ ఆకట్టుకుంటాయి.
క్యాబిన్లోనూ ప్లాటినం ఫినిష్తో పాటు 8 వే అడ్జస్టబలిటీతో లెదర్ స్పోర్ట్స్ సీట్లు, ప్రీమియం బోస్ సౌండ్ సిస్టం, యాంబియం్ లైటింగ్, పనోరామిక్ సన్రూఫ్, ప్రైవసీ గ్లాస్, స్పెషల్ డ్యాష్ఃబోర్డ్ వంటివి కస్టమర్లను ఆకట్టుకుంటాయి. పోర్షే కయెన్ ప్లాటినం ఎడిషన్ భారత్లో రూ 1.47 కోట్ల నుంచి అందుబాటులో ఉంది.