న్యూఢిల్లీ, జూన్ 16: పెట్రో పంప్ల వద్ద ఇంధనం కొనుగోళ్లకు డిజిటల్ రూపంలో చేసే చెల్లింపులపై ఇప్పటివరకూ ఇస్తున్న 0.75 శాతం ప్రోత్సాహకాన్ని నిలిపివేసినట్టు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ప్రకటించింది. పెట్రో మార్కెటింగ్ కంపెనీలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్లు ఈ సదుపాయాన్ని ఉపసంహరించడంతో తాము ప్రోత్సాహకాన్ని ఆపివేసినట్టు పీఎన్బీ తన వెబ్సైట్ నోటిఫికేషన్లో తెలిపింది. 2016లో పెద్ద నోట్ల రద్దు అనంతరం డిజిటల్ చెల్లింపులపై 0.75 శాతం డిస్కౌంట్ను ఇవ్వాలని పెట్రో కంపెనీలను కేంద్ర ప్రభుత్వం కోరింది. ఇప్పుడా సదుపాయాన్ని ఆయా కంపెనీలు ఉపసంహరించాయి.