హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 6 (నమస్తే తెలంగాణ): జపాన్కు చెందిన ఐటీ సంస్థ ఓపెన్ సీసెమ్తో ప్లూరల్ టెక్నాలజీ సంస్థలు పరస్పర అంగీకార ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ సందర్భంగా ప్లూరల్ టెక్నాలజీ సీఈవో సునీల్ సవరం మాట్లాడుతూ..ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ సేవలను మరింత విసృత పరచడానికి ఈ ఒప్పందం దోహదం చేయనున్నదన్నారు.
ప్రస్తుతం తమ రెండు కంపెనీల్లో సుమారు 500 మంది ఉద్యోగులు ఉండగా, వచ్చే 3 ఏళ్లలో 1000 మందికి పెంచుకోనున్నట్లు ప్రకటించిన ఆయన.. తద్వారా మొత్తం 3 ఏళ్లలో వంద మిలియన్ డాలర్ల వ్యాపారం చేసే ప్రణాళికతో ముందుకుసాగుతున్నట్లు తెలిపారు.