న్యూఢిల్లీ : ఈ ఏడాది జూన్ త్రైమాసంలో రికార్డు స్ధాయిలో దేశ ఎగుమతులు 9500 కోట్ల డాలర్లకు ఎగబాకాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం వెల్లడించారు. ఇంజనీరింగ్, రైస్, మెరైన్ ఉత్పత్తులు సహా పలు రగాల్లో ప్రోత్సాహకర వృద్ధి నమోదవడంతో ఎగుమతులు రికార్డుస్ధాయిలో పెరిగాయని మంత్రి పేర్కొన్నారు. 2018-19 జూన్ క్వార్టర్లో 8200 కోట్ల డాలర్ల ఎగుమతులు జరగ్గా, 2019-20లో 9000 కోట్ల డాలర్ల ఎగుమతులు నమోదయ్యాయని పీయూష్ గోయల్ తెలిపారు.
కొవిడ్-19 సెకండ్ వేవ్ విరుచుకుపడినా ఏప్రిల్-జూన్ క్వార్టర్లో అత్యధికంగా ఎగుమతులు నమోదయ్యాయని వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 40,000 కోట్ల డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ధాన్యం ఎగుమతులు కూడా రెండంకెల వృద్ధితో పెరుగుతున్నాయని పేర్కొన్నారు.