న్యూఢిల్లీ, డిసెంబర్ 16: ఈవే ఇండియా తమ తొలి హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ‘సోల్’ను మార్కెట్కు పరిచయం చేసింది. దీని ధర రూ.1,39,900. సింగిల్ చార్జింగ్పై 120 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని సంస్థ ఈ సందర్భంగా తెలిపింది. కాగా, వచ్చే రెండేండ్లలో వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడులకు యోచిస్తున్నట్లు ఈవే తెలిపింది.