న్యూఢిల్లీ, జూన్ 15:ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ ఫోన్పే కూడా స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నది. ఆర్థిక సేవలతోపాటు యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ఆధారిత చెల్లింపుల సేవలను మరింత విస్తరించడానికి అవసరమైన నిధులను క్యాపిటల్ మార్కెట్ల నుంచి సేకరించాలని సంకల్పించింది.
కంపెనీ నికర విలువ 8-10 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంటుందని అంచనా. ఈ విషయాన్ని ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఫ్లిప్కార్ట్ మాజీ ఎగ్జిక్యూటివ్లైన సమీర్ నిగమ్, రాహుల్ చారి, బర్జిన్ ఇంజినీర్ ప్రారంభించిన ఫోన్పేను 2016లో ఫ్లిప్కార్ట్ తిరిగి కొనుగోలు చేసింది.