హైదరాబాద్, సెప్టెంబర్ 13: హైదరాబాద్ మరో జాతీయ సదస్సుకు వేదికకాబోతున్నది. ఈ 15 నుంచి 17 వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ల్యాబరేటరీ టెక్నాలజీ, ఫార్మా యంత్రాలను ప్రదర్శించనున్నారు. మూడు రోజులపాటు జరగనున్న ఈ ఎక్స్పోకు ఈ రెండు విభాగాలకు సంబంధించిన 400 మంది సరఫరాదారులు 5 వేలకు పైగా ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. దక్షిణాదిలో జరగుతున్న తొలి సదస్సు ఇదే కావడం విశేషం. ప్రపంచంలో మూడో అతిపెద్దదైన భారత ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ గడిచిన ఆర్థిక సంవత్సరంలో 11 శాతం వృద్ధిని సాధించింది.