న్యూఢిల్లీ: దేశంలో చమురు ధరలు రికార్డు స్థాయికి చేరాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తక్కువగా ఉన్నప్పటికీ దేశీయ పెట్రోలియం కంపెనీలు వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ వస్తున్నాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. లీటర్ పెట్రోల్ పై 25 పైసలు, డీజిల్పై 33 పైసలు పెరిగింది. దీంతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ. 106.25, డిజీల్ ధర రూ. 98.72గా ఉంది.
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.89కి చేరగా.. డీజిల్ ధర రూ.90.47కి పెరిగింది. ముంబైలో పెట్రోల్ ధర రూ.107.95కు, లీటర్ డీజిల్ ధర రూ.98.16కు చేరింది.