సిటీబ్యూరో, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ)/శేరిలింగంపల్లి: పెంపుడు జంతువులకు సమగ్ర సేవలు అందించే పెట్ఫోక్ మొబైల్ యాప్ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ఆవిష్కరించారు. సోమవారం గచ్చిబౌలిలోని టీ హబ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆయన ఈ యాప్ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. పెంపుడు జంతువులకు సంబంధించిన అన్ని సేవలు అందించే ఈ యాప్తోవాటి యజమానులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పెంపుడు జంతువుల సంరక్షణ, ఆహార విషయంలో వాటి యజమానులు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి సేవలను అందించేందుకు ఇలాంటి యాప్లు అవసరమని సూచించారు. కార్యక్రమంలో టీ హబ్ సీఈవో ఎంఎస్ రావు, పెట్ఫోక్ యాప్ వ్యవస్థాపకులు