Personal Loans Low | ఎమర్జెన్సీ ఫండ్స్ అవసరమైనప్పుడు అందుబాటులో ఉన్న ఆప్షన్లలో పర్సనల్ లోన్. అదీ వ్యాపారులకైతే వారి ఐటీ రిటర్న్స్ ఆధారంగా లభిస్తుంది.. వేతన జీవుల శాలరీ ఆధారంగా పర్సనల్ లోన్ పొందొచ్చు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. ఏయేటికాయేడు పర్సనల్ లోన్ తీసుకునే వారి సంఖ్య తగ్గుతోంది. 2018 నుంచి ఈ ధోరణి కనిపిస్తుండటంతో కోవిడ్ వల్లే వ్యక్తిగత రుణాలు తగ్గుముఖం పట్టాయని చెప్పలేం.
2018లో ప్రజలు సగటున రూ.2,80,973 వ్యక్తిగత రుణాలు తీసుకున్నారు. కానీ నాటి నుంచి గత మూడేండ్లలో సగటున ప్రజలు తీసుకున్న పర్సనల్ లోన్స్ సుమారు రూ. లక్ష నుంచి రూ.1,86,338 పడిపోయాయి. పర్సనల్ లోన్స్ 45-58 ఏండ్ల మధ్య వయస్సు గల వారు భారీగా తగ్గారు. 2018లో ఈ గ్రూప్ వారు సగటున రూ.3,75,662 వ్యక్తిగత రుణాలు తీసుకున్నారు. కానీ ఈ ఏడాది పర్సనల్ లోన్స్ 48.56 శాతం తగ్గి రూ.1,93,240లకు చేరుకున్నాయి. 25 ఏండ్లు, అంతకు పైబడిన వయస్సు గల వారిలో పర్సనల్ రుణాలు తీసుకున్న వారు 30 శాతం తగ్గిపోయారు.
పర్సనల్ లోన్లలో మొండి బాకీలు పెరిగిపోవడంతో బ్యాంకులు క్రెడిట్ పాలసీని టైట్ చేశాయి. పర్సనల్ లోన్స్ తీసుకునే వారే గానీ.. తిరిగి వాటిని చెల్లించే వారు కాన రావడం లేదు. హై రిస్క్తో కూడుకున్నవి కావడంతోపాటు అన్ సెక్యూర్డ్ రుణాలు పర్సనల్ లోన్సు. అందుకే పర్సనల్ లోన్స్ తగ్గినట్లు కనిపిస్తున్నది.
ప్రస్తుతం బై నౌ పే లేటర్ ట్రెండ్ శరవేగంగా పెరుగుతున్నదని బ్యాంక్ బజార్ డాట్ కామ్ సీఈవో అదిల్ శెట్టి చెప్పారు. ఇది క్రెడిట్ రివాల్వింగ్.. బై నౌ పే లేటర్ స్కీమ్ను వాడుకున్న వారే పదేపదే వాడుకోవడం కూడా పౌరులు తీసుకునే వ్యక్తిగత రుణాలు తగ్గడానికి కారణంగా కనిపిస్తున్నది.