బెంగళూరు, జూన్ 27: హైదరాబాద్ కేంద్రంగా ఐటీ సేవలు అందిస్తున్న పెగాసిస్టమ్స్..రూ.60 కోట్ల పెట్టుబడితో బెంగళూరులో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్(జీసీసీ)ని ప్రారంభించింది. ఈ సందర్భంగా కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ విశ్వేశరయ్య మాట్లాడుతూ..ప్రపంచవ్యాప్తంగా ఏఐ టెక్నాలజీకి పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఈ జీసీసీని నెలకొల్పినట్టు, తద్వారా పలువురు టెక్నాలజీ నిపుణులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు. కంపెనీకి వచ్చిన మొత్తం ఆదాయంలో 38 శాతం ఈ సెంటర్ నుంచి ఆశిస్తున్నట్టు చెప్పారు. బ్యాంక్స్, టెలికాం, హెల్త్కేర్ సంస్థలకు టెక్నాలజీ సేవలు అందిస్తున్నట్టు తెలిపారు.