Paytm | ప్రముఖ ఫిన్టెక్ కంపెనీ పేటీఎం ( Paytm Payments Bank ) కు ఆర్బీఐ మంచి రిలీఫ్ ఇచ్చింది. పేటీఎం ఇక నుంచి భారత్ బిల్లు పేమెంట్ ఆపరేటింగ్ యూనిట్ (బీబీపీవోయూ)గా వ్యవహరించేందుకు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్) కింద పేటీఎం ద్వారా యూజర్ల ఎలక్ట్రిసిటీ, ఫోన్, డీటీహెచ్, వాటర్, గ్యాస్, ఇన్సూరెన్స్, లోన్ రీపేమెంట్, ఫాస్టాగ్ రీచార్జ్, ఎడ్యుకేషన్ ఫీజు, క్రెడిట్ కార్డు బిల్లులు, మున్సిపల్ టాక్సెస్ తదితర యుటిలిటీ బిల్లులు చెల్లించవచ్చు.
నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) అనుబంధ సంస్థే బీబీపీఎస్. ఇప్పటి వరకు యుటిలిటీ బిల్లుల వసూళ్లకు పేటీఎం పేమెంట్స్ బ్యాంకుకు ఆర్బీఐ సూత్రప్రాయ అనుమతి మాత్రమే ఇచ్చింది. పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్-2007 కింద భారత్ బిల్ పేమెంట్ ఆపరేటింగ్ యూనిట్ (బీబీపీవోయూ) నిర్వహణకు ఆర్బీఐ తమకు తుది ఆమోదం తెలిపిందని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ పేర్కొంది.