PayTM on Bitcoin | ఇండియాలో డిజిటల్ పేమెంట్స్లో అగ్రశ్రేణి సంస్థ పేటీఎం వినూత్నంగా యోచిస్తోంది. కేంద్ర ప్రభుత్వం, భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) చట్టబద్ధం చేస్తే బిట్ కాయిన్ ఆఫర్స్ చేయనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం క్రిప్టో కరెన్సీలపై దేశవ్యాప్తంగా అనిశ్చితి కొనసాగుతున్నది. బిట్ కాయిన్ను ప్రభుత్వ వర్గాలు చట్టవిరుద్ధ (గ్రే-ఏరియా) ఆస్తులుగా పరిగణిస్తున్నాయని పేటీఎం చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ మాధూర్ డియోరా ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. నియంత్రణల పరంగా ఇప్పటికే బిట్ కాయిన్ గ్రే ఏరియాలోనే ఉందని, అప్పటి వరకు దాన్ని తమ ఖాతాదారులకు ఆఫర్ చేయలేం అని అన్నారు. ఒకసారి దేశవ్యాప్తంగా చట్టబద్ధత కల్పిస్తే బిట్ కాయిన్పై ఆఫర్లు కల్పిస్తామని చెప్పారు.
2020 మార్చి వరకు క్రిప్టో కరెన్సీ లావాదేవీలపై ఆర్బీఐ నిషేధం విధించింది. ఆ తర్వాత దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు.. క్రిప్టో కరెన్సీ లావాదేవీలపై నిషేధాన్ని ఎత్తేసింది. ఆ తర్వాతే కేంద్రం క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నది. కానీ ఆర్బీఐ మాత్రం క్రిప్టో కరెన్సీపై నిషేధం విధించాలనే వాదిస్తున్నది. త్వరలో పేటీఎం ఐపీవోకు వెళ్లనున్న నేప్యంలో మాధూర్ డియోరా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.