Passenger Vehicle Sales | గతేడాదితో పోలిస్తే కార్లు, మోటారు బైక్లు, స్కూటర్ల విక్రయంలో గత నెలలో సరికొత్త రికార్డు నమోదైంది. కరోనా రెండో వేవ్తో గతేడాది సాధారణ స్థాయి కంటే తక్కువ కార్యకలాపాలు జరుపడంతోపాటు ప్రయాణికుల వాహనాల విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. కానీ 2021తో పోలిస్తే ఈ ఏడాది మే నెలలో ప్రయాణ వాహనాల సేల్స్ దాదాపు మూడు రెట్లు పెరిగాయి.
2021లో 4,44,131 వాహనాలు విక్రయిస్తే.. ఈ ఏడాది మే నెలలో 15,32,809 వెహికల్స్ విక్రయించారని ఇండస్ట్రీ బాడీ సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) తెలిపింది. కానీ, ప్యాసింజర్ల వాహనాల విక్రయంలో క్యాటగిరీల వారీగా తక్కువగా ఉన్నాయని సియామ్ వెల్లడించింది.
2021లో ప్యాసింజర్ వెహికల్స్ 43,341 విక్రయిస్తే.. ఈ ఏడాది 2,51,052కు చేరాయి. టాటా మోటార్స్ అత్యధికంగా 43,341 కార్లు విక్రయిస్తే, 42,293 కార్ల సేల్స్తో హ్యుండాయ్ రెండో స్థానానికి పరిమితమైంది. ఇదిలా ఉంటే టూ వీలర్స్, త్రీ వీలర్స్ సేల్స్ ఇప్పటికీ తగ్గుముఖం పట్టాయని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ మెనన్ తెలిపారు. టూ వీలర్స్.. తొమ్మిదేండ్ల స్థాయికి, త్రీ వీలర్స్.. 14 ఏండ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయాయని పేర్కొన్నారు.