GST On Insurance Products : ఆరోగ్య, టర్మ్ బీమా పాలసీలపై ప్రస్తుతం 18 శాతం ఉన్న జీఎస్టీని తగ్గించాల్సిన అవసరం ఉందని ఫైనాన్స్ స్టాండింగ్ కమిటీ సూచించింది. జీఎస్టీ అధికంగా ఉండటంతో ప్రీమియం భారం పడుతున్నందున సామాన్యులు బీమా పాలసీలు పొందడంపై అది ప్రతికూల ప్రభావం చూపుతు్నదని జయంత్ సిన్హా అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ నివేదిక వెల్లడించింది.
ఈ నివేదికను ప్రభుత్వం పార్లమెంట్ ముందుంచింది. ఇన్సూరెన్స్ జన సామాన్యానికి మరింత అందుబాటులోకి రావాలంటే పాలసీలపై జీఎస్టీ రేట్ను గణనీయంగా తగ్గించాలని నివేదిక ప్రభుత్వానికి సూచించింది. 2020లో ప్రపంచ బీమా మార్కెట్లో భారత్ వాటా కేవలం 2 శాతం కాగా, పురోగామి ఆర్ధిక వ్యవస్ధలతో పోలిస్తే మన బీమా మార్కెట్ దీటుగా ఎదిగేందుకు చాలా దూరం వెళ్లాల్సి ఉందని నివేదిక స్పష్టం చేసింది.
జీవిత బీమానే కాకుండా విభిన్న బీమా ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చి విస్తృత వ్యాప్తి చెందేలా చూసేందుకు ఇన్సూరెన్స్ ఉత్పత్తులపై జీఎస్టీ భారాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని కమిటీ నివేదిక పేర్కొంది.
Read More :