CBDT New Bank Rules | బ్యాంకింగ్ లావాదేవీల నిర్వహణ నిబంధనలు మారిపోబోతున్నాయి. బ్యాంకులో గానీ.. తపాల ఆఫీసులో నగదు లావాదేవీల నిర్వహణకు కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. నూతన రూల్స్ ప్రకారం ఇక నుంచి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.20 లక్షలు అంతకంటే ఎక్కువ మొత్తం బ్యాంకు లేదా తపాలాఫీసులో నగదు డిపాజిట్ చేస్తే ఆధార్, పాన్ కార్డు సమర్పించాల్సి ఉంటుంది. ఆదాయం పన్ను చట్టం (15వ సవరణ) నిబంధనలు-2022 కింద కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఖరారు చేసింది. ఈ మేరకు సీబీడీటీ ఈ నెల 10వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది. 2022 మే 26వ తేదీ నుంచి నూతన నిబంధనలను అమల్లోకి తెస్తున్నట్లు సీబీడీటీ వెల్లడించింది.
ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక బ్యాకింగ్ కంపెనీ లేదా సహకార బ్యాంకు లేదా పోస్టాఫీసుల్లో ఒకటి, అంతకంటే ఎక్కువ ఖాతాల్లో రూ.20 లక్షలు, అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే..
ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక బ్యాకింగ్ కంపెనీ లేదా సహకార బ్యాంకు లేదా పోస్టాఫీసుల్లో ఒకటి, అంతకంటే ఎక్కువ ఖాతాల్లో రూ.20 లక్షలు, అంతకంటే ఎక్కువ విత్ డ్రా చేస్తే..
ఏదేనీ బ్యాంక్, సహకార బ్యాంక్ లేదా పోస్టాఫీసులో కరంట్ ఖాతా లేదా క్యాష్ క్రెడిట్ ఖాతా తెరిస్తే.
ఏ ఒక్కరైనా కరంట్ ఖాతా తెరవడానికి పాన్ కార్డు సమర్పించాలి. అదే సమయంలో బ్యాంక్ ఖాతాలు గల వారు ఇప్పటికే పాన్కార్డు అనుసంధానించినా.. లావాదేవీల సమయంలో తప్పనిసరి పాన్ కార్డు సమర్పించాల్సి ఉంటుంది.