న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: ఆతిథ్య సేవల సంస్థ ఓయో..కార్పొరేట్ క్లయింట్లను ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నది. ఈ ఏడాది జనవరి-జూలై మధ్యకాలంలో 2,800 కార్పొరేట్ క్లయింట్లు చేరారని సంస్థ వెల్లడించింది. ‘ఓయో బిజినెస్ ట్రావెల్ ట్రెండ్ రిపోర్ట్ 2023’ నివేదికలో ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో బిజినెస్ ట్రావెల్ ద్వారా వచ్చే ఆదాయంలో 20 శాతం పెరుగుదల నమోదైందని తెలిపింది.
అంతక్రితం ఏడాది ఇదే సమయంలో కలిసిన 2,471 కార్పొరేట్ క్లయింట్లతో పోలిస్తే 12 శాతం పెరిగినట్టు తెలిపింది. ఈ ఏడాది జనవరి నుంచి జూలై మధ్యకాలంలో జతైన 2,800 కార్పొరేట్ క్లయింట్లలో హైదరాబాద్లోనే అత్యధికంగా 660 ఉన్నట్టు తెలిపింది. ఆ తర్వాత గురుగ్రామ్లో 593, ఢిల్లీలో 343, బెంగళూరులో 315, ముంబైలో 282, కోల్కతాలో 268, పుణెలో 218 క్లయింట్లు కొత్తగా చేరారని వెల్లడించింది.