Mahindra | దేశీయ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం)లో తన ఎక్స్యూవీ 700, ఎక్స్యూవీ 400 మోడల్ కార్లు 1.1 లక్షలకు పైగా యూనిట్లు రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఎక్స్యూవీ 700 కారు వైరింగ్ లూమ్లో లోపాలు ఉండటంతో 1,08,306 యూనిట్లు రీకాల్ చేస్తున్నట్లు తెలిపింది. 2021 జూన్ ఎనిమిదో తేదీ నుంచి 2023 జూన్ 28 వరకు తయారైన ఎక్స్యూవీ 700 యూనిట్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది.
అలాగే ఎక్స్యూవీ 400 మోడల్ కార్ల బ్రేక్ పొటెన్షియో మీటర్లో స్ప్రింగ్ రిటర్న్ యాక్షన్ లోపం కారణంగా 3560 యూనిట్లు రీకాల్ చేస్తున్నామని తెలిపింది. గత ఫిబ్రవరి 16 నుంచి జూన్ ఐదో తేదీ వరకూ తయారైన ఎక్స్యూవీ 400 కార్లను రీకాల్ చేస్తున్నామని తెలిపింది.
స్వచ్ఛందంగానే తాము ఈ కార్లను రీకాల్ చేస్తున్నట్లు రెగ్యులేటరీ ఫైలింగ్లో మహీంద్రా అండ్ మహీంద్రా వెల్లడించింది. ఆయా కార్లను తనిఖీ చేయడంతోపాటు అవసరమైతే మరమ్మతు ఉచితంగా చేస్తామని పేర్కొంది. తమ కస్టమర్లను నేరుగా సంప్రదిస్తామని వివరించింది.