న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది కోటి స్మార్ట్ ఫోన్లు విక్రయించి నిర్ధేశిత లక్ష్యాన్ని ముందుగానే అధిగమించామని చైనా స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీ వన్ప్లస్ సీఈఓ పీట్ లౌ తెలిపారు. కంపెనీ ఎనిమిదో వార్షికోత్సవం సందర్భంగా వీబోలో రాసిన వ్యాసంలో ఈ వివరాలు వెల్లడించారు. వన్ప్లస్ 9 సిరీస్ లాంఛ్ అయిన పది సెకండ్లలోనే 40 మిలియన్ డాలర్ల విలువైన అమ్మకాలు సాగాయని తెలిపారు. అందుబాటు ధరలో వన్ప్లస్ 9ఆర్, 9ఆర్టీ స్మార్ట్ఫోన్లను కూడా ఈ ఏడాది వన్ప్లస్ లాంఛ్ చేసింది.
వన్ప్లస్ 10 క్వాల్కాం లేటెస్ట్ 8 జెన్ 1 చిప్సెట్తో రానుందని కంపెనీ ప్రకటించింది. 2021 ప్రధమార్ధంలో వన్ప్లస్ గ్లోబల్ షిప్మెంట్స్ 257 శాతం వృద్ధి నమోదు చేశాయి. ఇక యూరప్లో వన్ప్లస్ ఈ ఏడాది రెండో క్వార్టర్లో అత్యధిక వృద్ది రేటు సాధించిన స్మార్ట్ఫోన్ బ్రాండ్గా నిలిచింది. ఈ క్వార్టర్లో వన్ప్లస్ అమ్మకాలు ఏకంగా 304 శాతం వృద్ధి రేటు నమోదు చేసింది. ఇక భారత్లో 29 శాతం వార్షిక వృద్ధి సాధించగా ఈ ఏడాది మూడో క్వార్టర్లో రూ 30,000పైబడిన స్మార్ట్ఫోన్ల విక్రయంలో 30 శాతం మార్కెట్ వాటాను కైవసం చేసుకున్నామని వన్ప్లస్ వెల్లడించింది.