OnePlus Nord CE 4 Lite 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ప్లస్.. భారత్ మార్కెట్లో మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ ఆవిష్కరించేందుకు రంగం సిద్ధం చేసింది. వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ పేరుతో ఈ నెల 18 రాత్రి ఏడు గంటలకు భారత్ మార్కెట్లో ఆవిష్కరిస్తారు. వన్ ప్లస్ నార్డ్ సీఈ3 లైట్ ఫోన్ కొనసాగింపుగా వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ ఫోన్ వస్తోంది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు మద్దతుతో 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ ప్లేతో వస్తోంది. ఆండ్రాయిడ్ 14 ఓఎస్ వర్షన్ పై పని చేస్తుందీ ఫోన్. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 6 జనరేషన్ 1 ఎస్వోసీ లేదా క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 695 ఎస్వోసీ ప్రాసెసర్ సాయంతో పని చేస్తుందని భావిస్తున్నారు.
వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ ఫోన్ 80 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది. 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ఫోన్ రూ.20 వేల లోపే అందుబాటులో ఉంటుందని తెలుస్తున్నది. మూడేండ్ల పాటు సెక్యూరిటీ అప్ డేట్స్, ఓఎస్ అప్ డేట్స్ రెండేండ్లు అందించనున్నది.
50-మెగా పిక్సెల్ రేర్ మెయిన్ కెమెరా, 2-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరాతోపాటు సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది. సెక్యూరిటీ, బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. 3.5 ఎంఎం ఆడియో జాక్, స్టీరియో స్పీకర్లు ఉంటాయి. 5జీ, బ్లూటూత్ 5.2, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది.