OnePlus Nord CE 4 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ప్లస్ (OnePlus) తన వన్ప్లస్ నార్డ్ సీఈ 4 (OnePlus Nord CE 4) ఫోన్ను ఏప్రిల్ ఒకటో తేదీన భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. ఈ ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్ తో వస్తుంది. దీని ధర రూ.30 వేల లోపు ఉంటుందని అంచనా. డార్క్ క్రోమ్, సెలడోన్ మార్బుల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. 6.7 అంగుళాల అమోలెడ్ స్క్రీన్ డిస్ ప్లేతో వస్తున్నది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 8-మెగా పిక్సెల్ సెన్సర్ తో కూడిన డ్యుయల్ రేర్ కెమెరా సెటప్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది.
వన్ప్లస్ నార్డ్ సీఈ 4 ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీతో వస్తుంది. మైక్రో ఎస్డీ కార్డ్ సాయంతో దీని స్టోరేజీ కెపాసిటీ ఒక టిగా బైట్ వరకూ పొడిగించుకోవచ్చు. అమెజాన్ ఇండియా వెబ్ సైట్ ద్వారా వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 ఫోన్ కొనుగోలు చేయొచ్చు. వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 ఫోన్ ధర ఎంత అన్నది వెల్లడించలేదు. ఇంతకుముందు మార్కెట్లో ఆవిష్కరించిన వన్ ప్లస్ నార్డ్ ఎస్ఈ 3 ఫోన్ రూ.26,999 నుంచి ప్రారంభమైంది. ఈ ఫోన్ రియల్ మీ 12 ప్రో+, ఒప్పో రెనో11, శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ, ఐక్యూ జడ్7 ప్రో తదితర ఫోన్లతో వన్ ప్లస్ నార్డ్ ఎస్ఈ 4 ఫోన్ తల పడుతుంది.