OnePlus Nord CE 3 Lite | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ ప్లస్ నోర్డ్ సీఈ 3 లైట్ 5జీ (OnePlus Nord CE 3 Lite) ఫోన్ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించడానికి ముహూర్తం ఖరారైంది. యూజర్లకు అందుబాటు ధరలోనే ఉండనున్నది. ఏప్రిల్ నాలుగో తేదీన (అంటే మంగళవారం) భారత్ మార్కెట్లోకి రానున్నది. దీని ధర రూ.21,999 ఉంటుందని భావిస్తున్నారు.
అడ్రెనో 619 జీపీయూతోపాటు స్నాప్ డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్తో వస్తున్నది. 8జీబీ రామ్తో వస్తున్న ఈ ఫోన్లో వర్చువల్గా రామ్ కెపాసిటీ మరో 8 జీబీ వరకు పెంచుకోవచ్చు. 67 వాట్ల సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్తో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది. కేవలం 30 నిమిషాల్లోనే ఫుల్ చార్జ్ అవుతుంది.
బ్యాక్ ప్యానెల్లో 3×లూస్లెస్ జూమ్తో 108-మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతో వస్తున్నది. దీంతోపాటు 2ఎంపీ మాక్రో లెన్స్ కెమెరా, 2 ఎంపీ డెప్త్ సెన్సర్ కెమెరా కూడా ఉంటాయి. మరో రెండు కెమెరాలు, సెల్ఫీ కెమెరా డిటైల్స్ అందుబాటులోకి రాలేదు.
అదే రోజు వన్ ప్లస్ నోర్డ్ సీఈ 3 లైట్ ఫోన్తోపాటు వన్ ప్లస్ నోర్డ్ బడ్స్2 కూడా ఆవిష్కరిస్తున్నది. ఈ ఇయర్బడ్స్లో 12.4 ఎంఎం డ్యుయల్ డ్రైవర్స్ ఇస్తున్నారు. వీటి ధర రూ.2,799గా అమెజాన్ వెబ్సైట్ చెబుతున్నది.