న్యూఢిల్లీ : వన్ప్లస్ (OnePlus) స్మార్ట్ఫోన్లు, ఇతర డివైజ్లపై ఆకర్షణీయ డీల్స్, ఆఫర్లను అందిస్తూ వన్ప్లస్ ఇండిపెండెన్స్ సేల్ను కంపెనీ ప్రారంభించింది. ఇప్పటికే సేల్ ప్రారంభం కాగా ఆగస్ట్ 31 వరకూ ఇది రన్ అవుతుంది. సేల్ పీరియడ్లో వన్ప్లస్ 11 5జీ, వన్ప్లస్ 11 ఆర్ 5జీ, వన్ప్లస్ ప్యాడ్, నార్డ్ సిరీస్లోని డివైజ్లపై ఆకట్టుకునే ఆఫర్లు, హాట్ డీల్స్ను కంపెనీ కస్టమర్లకు అందిస్తోంది.
పాత ఫోన్ను ఎక్స్ఛేంజ్ చేసి అప్గ్రేడ్ చేసుకోవాలనుకునే వారికి ఇది సరైన ఛాయిస్ అని వన్ప్లస్ చెబుతోంది. వన్ప్లస్ ఇండియా వెబ్సైట్పై వన్ప్లస్ 11 5జీ రూ. 56,999కి లభిస్తుండగా, ఐసీఐసీఐ క్రెడిట్, డెబిట్కార్డు దారులు ఈఐఎం లావాదేవీలపై రూ. 2000 ఇన్స్టంట్ డిస్కౌంట్ను పొందే వీలుంది. వన్కార్డు యూజర్లకు కూడా వన్ప్లస్ 11 5జీ, వన్ప్లస్ 11 5జీ మార్బుల్ ఒడిస్సీపై రూ . 2000 వరకూ ఇన్స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తోంది.
వన్ప్లస్ 11 5జీ 100డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, ఓఐఎస్తో కూడిన 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 890 కెమెరా సెన్సర్, 6.7 ఇంచ్ అమోల్డ్ డిస్ప్లే, ఆక్సిజన్ఓఎస్ ఆధారిత అండ్రాయిడ్ 13 వంటి కీలక ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఇక వన్ప్లస్ సేల్లో వన్ప్లస్ 11ఆర్ 5జీ రూ. 39,999కి అందుబాటులో ఉండగా ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ. 1000 ఆఫర్ను వన్ప్లస్ అందిస్తోంది. ఇక వన్ప్లస్ ఇటీవల లాంఛ్ చేసిన వన్ప్లస్ నార్డ్ 3 5జీ, వన్ప్లస్ నార్డ్ సీఈ3 5జీ వంటి హాట్ డివైజ్లపైనా సేల్ సందర్భంగా ఆకర్షణీయ ఆఫర్లను ప్రకటించింది.
Read More :