OnePlus | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ ప్లస్ (One Plus) తన వన్ ప్లస్ ఏస్5 (One Plus Ace5), వన్ ప్లస్ ఏస్5 ప్రో ( One Plus Ace 5 Pro) ఫోన్లను ఈ ఏడాది చివర్లో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. ప్రస్తుతం శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఆల్ట్రా, ఇతర ఫ్లాగ్ షిప్ ఫోన్లలో వినియోగిస్తున్న క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 4 ఎస్వోసీ ప్రాసెసర్ను వన్ ప్లస్ ఏస్ 5 ఫోన్ లో వినియోగిస్తున్నారని సమాచారం. అక్టోబర్ 21-23 మధ్య హవేలీలో నిర్వహించే స్నాప్ డ్రాగన్ సదస్సులో వన్ ప్లస్ ఏస్ 5 ప్రో ఆవిష్కరిస్తారని భావిస్తున్నారు. ఇదే సదస్సులో షియోమీ తన షియోమీ 15 ప్రో ఫోన్ ఆవిష్కరించనున్నట్లు తెలుస్తున్నది. డిసెంబర్ లో భారత్ మార్కెట్లోకి వన్ ప్లస్ ఏస్5, వన్ ప్లస్ ఏస్5 ప్రో ఫోన్లు రానున్నాయని చెబుతున్నారు.
వన్ ప్లస్ ఏస్ 5 ఫోన్ 1.5 కే ఎల్టీపీఓతోపాటు 6.78 అంగుళాల డిస్ ప్లే కలిగి ఉంటుంది. 50-మెగా పిక్సెల్ సెన్సర్ మెయిన్ కెమెరాతోపాటు ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. 100 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 6200 ఎంఏహెచ్ కెమపాసిటీ డ్యుయల్ సెల్ బ్యాటరీ వస్తుందని సమాచారం.