హైదరాబాద్, డిసెంబర్ 27: హైదరాబాద్ ప్రధాన కార్యాలయంగా ఎలక్ట్రానిక్ స్కూటర్లను విక్రయిస్తున్న బ్రిటన్కు చెందిన వన్-మోటో.. తాజాగా మార్కెట్లోకి మరో మోడల్ను పరిచయం చేసింది. అత్యంత వేగవంతమైన ఎలెక్టా స్కూటర్ ధర రూ.1.99 లక్షలుగా నిర్ణయించింది. కమ్యూటా, బైకాలను విడుదల చేసిన తర్వాత మూడో మోడల్ ఇది కావడం విశేషం. ఈ సందర్భంగా కంపెనీ ఇండియా పార్టనర్, ప్రమోటర్ ఎం రియాజ్ మాట్లాడుతూ.. భారత్లో ఈవీలకు భారీగా డిమాండ్ ఉందన్నారు.