Samsung | న్యూఢిల్లీ, మార్చి 14: గెలాక్సీ ఏ సిరీస్లో వస్తున్న రెండు సరికొత్త స్మార్ట్ఫోన్ల ధరలను గురువారం సామ్సంగ్ వెల్లడించింది. 5జీ శ్రేణిలో ఏ55, ఏ35 మాడళ్లను కంపెనీ తెస్తున్న విషయం తెలిసిందే. గెలాక్సీ ఏ35 5జీలో రెండు వేరియంట్లుండగా, ఏ55 5జీలో మూడు వేరియంట్లున్నాయి. కాగా, ఏ35 స్మార్ట్ఫోన్ కనిష్ఠ ధర రూ.30,999గా, గరిష్ఠ ధర రూ.33,999గా ఉన్నది. ఇక ఏ55 స్మార్ట్ఫోన్ ధరలు రూ.39,999, రూ.42,999, రూ.45,999గా ఉన్నాయి. ఏ35 మొబైల్స్ 8జీబీ ర్యామ్, 128, 256జీబీల స్టోరేజీ సామర్థ్యంతో ఉంటాయి. ఇక ఏ55 మొబైల్స్ 8జీబీ, 12జీబీల ర్యామ్తో 128, 256జీబీల స్టోరేజీ సామర్థ్యంతో ఉన్నాయి. డ్యూయల్ సిమ్ ఆప్షన్, 6.6 అంగుళాల సూపర్ ఎమో ఎల్ఈడీ డిస్ప్లేలతో పరిచయమైన ఈ మొబైల్స్లో.. ఏ35 మొబైల్లో 50, 8, 5 మెగాపిక్సల్తో బ్యాక్ కెమెరాలు.. 13 మెగాపిక్సల్తో ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.
ఏ55 మొబైల్లో 50, 12, 5 మెగాపిక్సల్తో బ్యాక్ కెమెరాలు.. 32 మెగాపిక్సల్తో ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. కాగా, సామ్సంగ్ ఎక్స్క్లూజివ్, భాగస్వామ్య స్టోర్లలో సామ్సంగ్.కామ్పై లైవ్ కామర్స్ ద్వారా సేల్స్ మొదలయ్యాయి. అయితే ఇతర ఆన్లైన్ వేదికలపై మాత్రం ఈ నెల 18 నుంచి అమ్మకాలు ఆరంభమవుతాయి. ఏ55 మొబైల్ను రూ.1,792, ఏ35 మొబైల్ను రూ.1,723 నెలవారీ ఈఎంఐతో కొనుగోలు చేసేలా బజాజ్ ఫైనాన్స్, ఇతర ఎన్బీఎఫ్సీలతో జట్టు కట్టినట్టు సామ్సంగ్ ఇండియా వీపీ (ఎంఎక్స్ బిజినెస్) ఆదిత్య బబ్బర్ తెలిపారు. సామ్సంగ్ ఫైనాన్స్ ప్లస్పైనా ఈ అవకాశం ఉంటుందన్నారు. ఇక హెచ్డీఎఫ్సీ, వన్కార్డ్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ కార్డులపై రూ.3,000 వరకు క్యాష్బ్యాక్ సౌకర్యం కూడా ఉన్నది. 6 నెలల నోకాస్ట్ ఈఎంఐ వెసులుబాట్లూ ఉన్నట్టు చెప్పారు. ఈ మొబైల్స్ ఆసమ్ ఐస్బ్లూ, లైలాక్, నావీ కలర్లలో లభిస్తున్నాయి.