హైదరాబాద్ సిటీబ్యూరో, మే 24 (నమస్తే తెలంగాణ): సాస్ (సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్) ప్రోడక్ట్ మేనేజ్మెంట్పై చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ-సీఐఈ ఇంక్యుబేషన్ సెంటర్ నిర్వాహకులు తెలిపారు. సేవా రంగంలో సాఫ్ట్వేర్ అప్లికేషన్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఈ రంగంలో ఉండే అవకాశాలను స్టార్టప్లకు వివరించే నిపుణులతో ఈ చర్చా కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు.
దేశంలో యునికార్న్ కంపెనీలుగా గుర్తింపు పొందిన డార్విన్ బాక్స్, జెప్టో కంపెనీలకు చెందిన ప్రతినిధులు నేరుగా ఈ చర్చలో పాల్గొంటారన్నారు. ఈ నెల 28న సీఐఈ ఇంక్యుబేషన్ కేంద్రంలో సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు చర్చ ఉంటుందని, ఇందులో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నవారు https://docs.google. com/formsలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.