OSM | న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: విద్యుత్తు ఆధారిత వాహనాల (ఈవీ) తయారీదారు ఒమెగా సీకీ మొబిలిటీ (ఓఎస్ఎం).. శుక్రవారం దేశీయ మార్కెట్లోకి ‘స్ట్రీమ్ సిటీ కిక్’ పేరుతో ఓ నయా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ త్రీవీలర్ను తీసుకొచ్చింది. కేవలం 15 నిమిషాల్లోనే చార్జింగ్ అవడం దీని ప్రత్యేకత. దీంతో ఆటో డ్రైవర్లకు ఇది ఎంతో లాభదాయకమని కంపెనీ వ్యవస్థాపక చైర్మన్ ఉదయ్ నారంగ్ చెప్తున్నారు.
కాగా, దీని ఎక్స్షోరూం ధర రూ.3,24,999. కొనుగోలుదారులకు 2 లక్షల కిలోమీటర్లు లేదా 5 ఏండ్ల వారంటీ లభిస్తుంది. ఇందులో 8.8 కిలోవాట్స్ బ్యాటరీ ఉన్నది. ఇదిలావుంటే ఈ ఏడాది ఢిల్లీ-ఎన్సీఆర్, బెంగళూరుల్లో 100 చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్న సంస్థ.. ఆ తర్వాత హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్, కోల్కతాల్లోనూ తేనున్నది.