హైదరాబాద్, ఏప్రిల్ 10 : దేశంలోనే అగ్రగామి ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్.. నూతన బ్రాండ్ ఐడెంటిటీని ఆవిష్కరించింది. సుస్థిర, విలువలతో కూడిన మొబిలిటీ దిశగా ప్రపంచవ్యాప్తంగా మార్పునకు నాయకత్వం వహించాలనే దార్శనికతతో, సంస్థ ట్రాన్స్ఫార్మింగ్ ఎవ్రీడే అనే కొత్త ట్యాగ్లైన్తో ఇక నుంచి ముందుకెళ్లనున్నట్టు కంపెనీఎండీ మహేశ్ బాబు వెల్లడించారు.
సుస్థిరమైన మొబిలిటీ, ఎనర్జీ సొల్యూషన్స్తో బాధ్యతాయుతమైన భవిష్యత్తు వైపు ప్రపంచాన్ని నడిపించాలనే ఒలెక్ట్రా దీర్ఘకాలిక లక్ష్యానికి అనుగుణంగా నూతన బ్రాండ్ నిలువనున్నదన్నారు.