న్యూఢిల్లీ, ఆగస్టు 15: ఓలా ఎలక్ట్రిక్ సోమవారం కార్ల తయారీలోకి అడుగు పెడుతున్నట్టు ప్రకటించింది. 2024లో తొలి మోడల్ను అందుబాటులోకి తెచ్చే యోచనలో ఉన్నట్టు స్పష్టం చేసింది. 2026-2027 నాటికి ఏటా 10 లక్షల ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలను లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఓలా వ్యవస్థాపక సీఈవో భవీశ్ అగర్వాల్ తెలిపారు. మీడియా సమావేశంలో మాట్లా డుతూ ఎలక్ట్రిక్ టూవీలర్ల దగ్గర్నుంచి కార్లదాకా అన్ని వర్గాలకు సరిపోయే వాహన ఉత్పత్తులను అమ్మాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. వీటి ధరల శ్రేణి లక్ష నుంచి 50 లక్షల రూపాయల మధ్య ఉంటుందన్నారు. తమ ఎస్1 ఎలక్ట్రిక్ టూవీలర్ను సరికొత్తగా అగర్వాల్ ఆవిష్కరించారు. ఈ క్రమంలోనే కార్ల పరిచయం గురించి విలేఖరుల ప్రశ్నలకు పైవిధంగా స్పందించారు.