S1 Air | దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ తన ఎస్1 ఎయిర్ స్కూటర్పై కస్టమర్లకు ఆఫర్ పొడిగించింది. ఈ నెల 15 వరకు పర్చేజింగ్ విండో కింద బుకింగ్ చేసుకున్న వారికి రూ.10 వేల డిస్కౌంట్ అందిస్తున్నది. ఇంతకుముందు ఈ రాయితీ జూలై 30 వరకే పరిమితం చేసింది. కానీ, కస్టమర్ల నుంచి గిరాకీ ఎక్కువగా ఉండటంతో దీన్ని ఆగస్టు 15 వరకు పొడిగించినట్లు ఓలా ఎలక్ట్రిక్ సోమవారం పేర్కొంది. అంటే రూ.1,09,999లకే ఓలా ఎస్1 ఎయిర్ స్కూటర్ లభిస్తుంది. ఇంతకుముందు జూలై 29,30 తేదీలకే పర్చేజింగ్ విండోను పరిమితం చేసింది ఓలా ఎలక్ట్రిక్. గడువు దాటిన తర్వాత బుక్ చేసుకున్న వారికి రూ.1,19,999లకు విక్రయిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.
జూలైలో దేశీయ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ సేల్స్లో ఓలా ఎలక్ట్రిక్ 40 శాతం మార్కెట్ వాటా పొందింది. 2022తో పోలిస్తే జూలై విక్రయాల్లో 375 శాతం వృద్ధి సాధించింది. జూలైలో సుమారు 19 వేల స్కూటర్లను విక్రయించింది. ఓలా ఎలక్ట్రిక్.. ఈవీ వెహికల్స్లో #EndICEAge నినాదాన్ని నిజం చేయడానికి నిబద్దతతో పని చేస్తుందని ఓలా ఎలక్ట్రిక్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అంకుశ్ అగర్వాల్ తెలిపారు. ఆగస్టులో ఎస్1 ఎయిర్ స్కూటర్ల డెలివరీ ప్రారంభించనున్నది.
తక్కువ రన్నింగ్ టైం, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతోపాటు అత్యాధునిక టెక్నాలజీ, డిజైన్తో ఎస్1 ఎయిర్ అందుబాటులోకి వస్తున్నది. మూడు కిలోవాట్ల కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంది. సింగిల్ చార్జింగ్ తో 125 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. గంటకు గరిష్టంగా 90 కి.మీ. వేగంతో ప్రయాణించగల సామర్థ్యం కలిగి ఉంటుంది.