Ola Electric | భారత్లోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్.. టూ వీలర్స్ సేల్స్లో అగ్రస్థానంలోనే కొనసాగుతున్నది. సబ్సిడీ తగ్గింపుతో ఈవీ టూ వీలర్స్ విక్రయాలు తగ్గినా జూన్ నెలలో 18 వేల స్కూటర్ల విక్రయంతో 40 శాతం మార్కెట్ వాటాను ఓలా ఎలక్ట్రిక్ సొంతం చేసుకున్నది. ఓలా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అన్షుల్ ఖండేల్వాల్ స్పందిస్తూ.. సబ్సిడీల తగ్గింపుతో జూన్ నెలలో ఎలక్ట్రిక్ టూ వీలర్స్ సేల్స్ మందకోడిగా ఉన్నా స్కూటర్ల విక్రయాలు బాగానే జరిగాయన్నారు. ఎస్1 ఎయిర్ స్కూటర్తో ఈవీ స్కూటర్ విభాగాన్ని మరింత విస్తరిస్తున్నట్లు తెలిపారు.
దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి ఎక్స్పీరియన్స్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నది ఓలా. ఇటీవలే 750వ ఎక్స్పీరియన్స్ కేంద్రం ప్రారంభించింది. వచ్చేనెలాఖరు నాటికి వెయ్యి ఎక్స్పీరియన్స్ కేంద్రాల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నది. ప్రతి 20 కి.మీ. పరిధిలో 90 శాతం మంది ఓలా స్కూటర్ల యజమానులకు సేవలు అందుబాటులోకి తెస్తున్నది.
దేశంలోని ఎలక్ట్రిక్ టూ వీలర్స్లో ఓలా ఎస్1 అత్యంత మెరుగైన ఈవీ స్కూటర్. ఫేమ్-2 కింద టూ వీలర్స్కు కేంద్రం ఇస్తున్న తగ్గించడంతో ఓలా ఎస్1 ప్రో రూ.1,39,999లకు, ఎస్1 (3కిలోవాట్లు) రూ.1,29,999 లకు, ఎస్1 ఎయిర్ స్కూటర్ (3కిలోవాట్లు) రూ.1,09,999లకు లభిస్తున్నాయి.