న్యూఢిల్లీ, మే 21:ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా..కొనుగోలుదారులకు షాకిచ్చింది. కంపెనీకి చెందిన ఎస్1 ప్రో ధరను రూ.10 వేలు పెంచుతున్నట్లు ప్రకటించింది. గత రెండు విడుతలుగా ధరల్లో ఎలాంటి మార్పులు చేయని సంస్థ.. మూడో విడుత మాత్రం ఎస్1 ప్రో మోడల్ ధరను పెంచేసింది.
ధరలు పెంచడానికి గల కారణాలను మాత్రం సంస్థ వెల్లడించలేదు. దీంతో దేశంలో ఎస్1 ప్రో మోడల్ ధర రూ.1.40 లక్షలకు చేరుకున్నది. గతంలో ఈ స్కూటర్ ధర రూ.1.30 లక్షలుగా ఉండేది. గతేడాది ఆగస్టులో ఈవీల విభాగంలోకి అడుగుపెట్టిన తర్వాత ధరలు పెంచడం ఇదే తొలిసారి.