ముంబై, జూన్ 19:ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థ ఎన్టీపీసీ నికరలాభం ఏకంగా మూడు రెట్లు పెరిగింది. 2021 మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ.4,649 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదేకాలంలో లాభం రూ.1,630 కోట్లు. మొత్తం ఆదాయం రూ. 31,330 కోట్ల నుంచి రూ.31,687 కోట్లకు పెరిగినట్లు ఎక్సేంజీలకు సమర్పించిన ఫైలింగ్లో కంపెనీ తెలిపింది. శనివారం సమావేశమైన ఎన్టీపీసీ డైరెక్టర్ల బోర్డు షేరుకు రూ.3.15 చొప్పున తుది డివిడెండును సిఫార్సుచేసింది.