న్యూఢిల్లీ : కన్ఫర్మ్ అయిన ట్రైన్ టికెట్ల క్యాన్సిలేషన్, హోటల్ బుకింగ్స్పై జీఎస్టీ విధించనున్నట్టు ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఫస్ట్ క్లాస్, ఏసీ కోచ్ టికెట్ల క్యాన్సిలేషన్పై 5 శాతం జీఎస్టీ విధిస్తారని, విమానయానం, హోటల్ బుకింగ్స్ రద్దుపైనా 5 శాతం జీఎస్టీ వర్తిస్తుందని ఆర్ధిక మంత్రిత్వ శాఖ ట్యాక్స్ రీసెర్చ్ యూనిట్ ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆయా సర్వీసులపై విధించే జీఎస్టీకి సమానంగా క్యాన్సిలేషన్ చార్జీలపై జీఎస్టీ విధిస్తారని తెలిపింది.
కాంట్రాక్ట్ ఉల్లంఘనకు పాల్పడినందుకు బదులుగా క్యాన్సిలేషన్ చార్జ్ చెల్లించాల్సి ఉన్నందున జీఎస్టీ వర్తిస్తుందని పేర్కొంది. ఇక ఎలాంటి పరిస్ధితిలోనైనా టికెట్ క్యాన్సిలేషన్ విషయంలో క్యాన్సిలేషన్ చార్జీలపై ఇప్పుడు 5 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ప్రయాణీకుడు కాంట్రాక్టు ఉల్లంఘనకు పాల్పడితే సర్వీస్ ప్రొవైడర్ క్యాన్సిలేషన్ చార్జీలు వసూలు చేస్తారని ఈ చెల్లింపుపై జీఎస్టీ వర్తిస్తుందని ఆర్ధిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ పేర్కొంది.