Ola Solo | దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ‘ఓలా ఎలక్ట్రిక్’.. నూతన ఎలక్ట్రిక్ స్కూటర్ ‘ఓలా సోలో’ ఆవిష్కరించింది. ఇది ప్రపంచంలోకెల్లా తొలి అటానమస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని కంపెనీ ఫౌండర్ కం సీఈఓ భవిష్ అగర్వాల్.. తన ‘ఎక్స్ (మాజీ ట్విట్టర్)’ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇది ఏప్రిల్ ఫూల్ కాదు.. నిజంగా ప్రపంచంలోనే తొలి సెల్ఫ్ డ్రైవెన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని పేర్కొన్నారు. ‘మీకు నూతన ప్రొడక్ట్ అందుబాటులోకి తెస్తున్నాం. ఏఐ ఆధారిత ట్రాఫిక్ స్మార్ట్ స్కూటర్ ‘ఓలా సోలో’.. తొలి భారత్ అటానమస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అది’ అని తెలిపారు. సెల్ఫ్ బ్యాలెన్సింగ్ టెక్నాలజీతో వస్తుందన్నారు.
Not just an April fools joke!
We announced Ola Solo yesterday. It went viral and many people debated whether it’s real or an April fools joke!
While the video was meant to provide a laugh to people, the technology behind it is something we’ve been working on and have… pic.twitter.com/4AUEqtPBGW
— Bhavish Aggarwal (@bhash) April 2, 2024
మామూలుగా కొన్ని కంపెనీలు ప్రతిఏటా ఏప్రిల్ ఒకటో తేదీన కస్టమర్లను ఫూల్ చేయడానికి కొన్ని కథనాలు, వీడియోలు విడుదల చేస్తుంటాయి. తొలుత సోమవారం (ఏప్రిల్1) నాడు ‘ఓలా సోలో’ స్కూటర్ వీడియోను భవిష్ అగర్వాల్ పోస్ట్ చేశారు. తాము తయారు చేసిన వీడియో సరదాగా రూపొందించినా, ఈ టెక్నాలజీ ఆధారిత ఈవీ స్కూటర్ తయారు చేయడంపై తమ టీం ఫోకస్ చేస్తున్నదన్నారు. ఇప్పటికే ఈ ఈవీ స్కూటర్ ప్రొటోటైప్ కూడా సిద్ధమైందంటూ మరో వీడియో పోస్ట్ చేశారు భవిష్ అగర్వాల్.