Big Billion Days | న్యూఢిల్లీ, అక్టోబర్ 10: తమ బిగ్ బిలియన్ డేస్ సేల్ మొదటి రోజున 60 శాతం ఆర్డర్లు నాన్-మెట్రో నగరాల నుంచే వచ్చాయని డిజిటల్ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ మంగళవారం వెల్లడించింది. మొబైల్ ఫోన్లు, అప్లియెన్సెస్, లైఫ్ ైస్టెల్ ఉత్పత్తులను జోరుగా కొనుగోలు చేశారన్నది. తొలి రోజైన అక్టోబర్ 7నాటి సేల్స్ డాటాను కంపెనీ వెల్లడిస్తూ గత పండుగ సీజన్తో పోలిస్తే ఈ దఫా లైఫ్ ైస్లెల్ ఉత్పత్తులకు ఆర్డర్లు 10 రెట్లు పెరిగాయని, ఫర్నీచర్ అమ్మకాలు 8 రెట్లు, ఎలక్ట్రానిక్స్ 7 రెట్లు అధికమైనట్టు తెలిపింది.
మొదటిరోజున 9.1 కోట్ల మంది కస్టమర్ విజిట్స్ జరిగాయన్నది. అక్టోబర్ 8న ఫ్లిప్కార్ట్ తన వీఐపీ కస్టమర్లకు 24 గంటలూ యాక్సెస్ కల్పించింది. పెయిడ్ సబ్స్క్రయిబర్లను, ఒక ఏడాదిలో కనీసం నాలుగు దఫాలు ప్లాట్ఫామ్పై షాప్ చేసిన ప్లస్ క్యాటగిరీ సబ్స్క్రయిబర్లను వీఐపీ కస్టమర్లుగా ఫ్లిప్కార్ట్ పరిగణిస్తున్నది. తమ షాపర్లలో అత్యధికంగా బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ నగరాల నుంచి విజిట్ చేశారని, అటుతర్వాత స్థానాల్లో ముంబై, పూణె, అహ్మదాబాద్, కోల్కతా, చెన్నై, గుర్గావ్లు ఉన్నాయి. మెట్రో, టైర్ 2 నగరాల నుంచి రూ.20,000 ధరకు పైబడిన స్మార్ట్ఫోన్లకు డిమాండ్ పెరిగిందని ఫ్లిప్కార్ట్ వివరించింది.