న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: 5జీ స్మార్ట్ఫోన్ పరిధిని మరింత విస్తరించుకోవడానికి నోకియా మరో మాడల్ను పరిచయం చేసింది. ఎక్స్30 పేరుతో విడుదల చేసిన ఈ స్మార్ట్ఫోన్ ధరను రూ.48,999గా నిర్ణయించింది.
క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 695 ఎస్వోసీ ఆపరేటింగ్ సిస్టమ్ కలిగిన ఈ స్మార్ట్ఫోన్ 8జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ మెమొరీ, ఆండ్రాయిడ్ 12, 4200 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్స్ ఉన్నాయి.