న్యూఢిల్లీ, నవంబర్ 30: కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన తర్వాత క్రిప్టోకరెన్సీపై కొత్త బిల్లును ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెడతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. మంగళవారం రాజ్యసభలో టీఆర్ఎస్ సభ్యుడు కే కేశవరావు లేవనెత్తిన ప్రశ్నకు మం త్రి బదు లిస్తూ వర్చువల్ కరెన్సీకి సంబంధించి వేగంగా మారుతున్న పరిస్థితుల్ని కొత్త బిల్లు ఫీచర్ల లో పొందు పరుస్తా మని, గతంలో రూపొందించిన క్రిప్టో బిల్లులో ఫీచర్లను కొత్త బిల్లులో చేరుస్తామని వివరించారు. శీతాకాల సమావేశాలు డిసెంబర్ 23న ముగియనున్నాయి. ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు ‘క్రిప్టోకరెన్సీ, రెగ్యులేషన్ ఆఫ్ ఆఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు, 2021’ను లోక్సభ బులెటిన్-పార్ట్2లో చేర్చారు. దేశంలో అన్ని ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలను నిషేధించాలని బిల్లులో ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే క్రిప్టోకరెన్సీ టెక్నాలజీ, దాని ప్రయోజనాల్ని ప్రమోట్ చేసేందుకు కొన్ని మినహాయింపులివ్వాలని ఉద్దేశించారు. ఆ మినహాయింపులేమిటనేది ఇప్పటివరకూ వెల్లడికాలేదు. గత వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టదల్చిన బిల్లు లో మార్పులు చేసి కొత్త బిల్లును తీసుకొస్తున్నట్లు సీతారామన్ వెల్లడించారు. గతంలో లానే ఈసారి కూడా బిల్లును ప్రవేశపెట్టబోమన్న అనుమానాలు ఏర్పడ్డాయని, కానీ సభ ఆమోదించే విధంగా కొత్త బిల్లును త్వరలోనే ప్రవేశపెడతామని మంత్రి స్పష్టం చేశారు.