Air India to TATA |
ఎయిర్ ఇండియా (ఏఐ)లో పని చేస్తున్న ఉద్యోగులను ఏడాది పాటు టాటా గ్రూప్ కొనసాగించనున్నది. ప్రభుత్వం నుంచి అధికారికంగా టేకోవర్ చేసిన తర్వాత రెండో ఏడాదిలో ఎయిర్ ఇండియా ఉద్యోగులను స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) ద్వారా తొలగించేందుకు అనుమతించారు.
ప్రస్తుతం ఎయిర్ ఇండియాలో 12,085 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వారిలో 8.084 మంది పర్మినెంట్, 4,001 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు సేవలందిస్తున్నారు. ఇక ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సంస్థలో 1,434 మంది ఉద్యోగులు ఉన్నారు.
ఐదేండ్ల పాటు ఎయిర్ ఇండియా బ్రాండ్, లోగో యధావిధిగా కొనసాగుతాయి. 1953లో టాటా గ్రూప్ నుంచి టేకోవర్తో జాతీయకరణ చేసిన ఎయిర్ ఇండియా తిరిగి టాటా సన్స్ గ్రూప్ చెంతకు చేరనున్నది.