హైదరాబాద్, నవంబర్ 11: ఖనిజ ఉత్పత్తి సంస్థ ఎన్ఎండీసీ ఆర్థిక ఫలితాల్లో అదరహో అనిపించింది. సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను పన్నులు చెల్లించిన తర్వాత రూ.2,341 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.774 కోట్లతో పోలిస్తే 202 శాతం అధికం. అలాగే కంపెనీ ఆదాయం రూ.2,230 కోట్ల నుంచి రూ.6,794 కోట్లకు చేరుకున్నట్లు ప్రకటించింది. గత త్రైమాసికంలో సంస్థ 8.77 మిలియన్ టన్నుల ఖనిజాన్ని ఉత్పత్తి చేయగా, 8.99 మిలియన్ టన్నుల ఖనిజాన్ని విక్రయించింది.