హైదరాబాద్, సెప్టెంబర్ 14 ( నమస్తే తెలంగాణ ): ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండీసీ.. రాజ్య భాష కీర్తి పురస్కార్ అవార్డును దక్కించుకుంది. మంగళవారం రాజ్య భాష దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును కేంద్ర మంత్రి నిశిత్ ప్రమాంక్ చేతుల మీదుగా ఎన్ఎండీసీ ఈడీ షణ్ముగనాథం అందుకున్నారు.