హైదరాబాద్, డిసెంబర్ 1: ఖనిజ ఉత్పత్తిలో అగ్రగామి సంస్థయైన ఎన్ఎండీసీ ఆశాజనక పనితీరు కనబరిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్యకాలంలో సంస్థ 27.31 మిలియన్ టన్నుల ఖనిజాన్ని ఉత్పత్తి చేసింది. ఏడాది క్రితం ఇదే సమయంలో ఉత్పత్తి చేసిన 23.32 మిలియన్ టన్నులతో పోలిస్తే ఇది 17 శాతం అధికం.
ఇదే సమయంలో సంస్థ విక్రయాలు 22.49 మిలియన్ టన్నుల నుంచి 27.78 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి. మరోవైపు, గత నెలలో సంస్థ 3.83 మిలియన్ టన్నుల ఖనిజాన్ని ఉత్పత్తి చేయగా, 3.79 మిలియన్ టన్నులను విక్రయించింది. దేశవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న ఖనిజంలో సంస్థ 20 శాతం ఉత్పత్తి చేస్తుండటం విశేషం.