హైదరాబాద్, మార్చి 21: ప్రభుత్వరంగ సంస్థ ఎన్ఎండీసీ..మరోసారి ఖనిజ ధరలను పెంచింది. లంప్సం ధరను రూ.100 పెంచడంతో టన్ను రూ.4,500కి చేరుకున్నది. నాణ్యమైన ఖనిజ టన్ను ధరను రూ.200 పెంచడంతో రూ.4,110కి చేరుకున్నట్లు సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది. పెరిగిన ధరలు వెంటనే అమలులోకి రానున్నట్లు పేర్కొంది.